Tuesday 12 April 2011

వైభవంగా సీతారాముల కల్యాణం


వైభవంగా సీతారాముల కల్యాణం






వైభవంగా సీతారాముల కల్యాణం
భద్రాచలం : భూలోక వైకుంఠమైన భద్ర గిరిలో మంగళవారం శ్రీసీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. 

ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి.

కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నిండు గంటలకు కళ్యాణం జరిగింది. రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలో భాగంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధీ సేవ నిర్వహిస్తారు.

భద్రాద్రిలో పెళ్లి సందడి

వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో భద్రాద్రిలో పెళ్లిసందడి నెలకొంది. భద్రాద్రి పురవీధులన్నీ జనసంద్రంగా మారాయి. 12సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే భద్రాచలం చేరుకున్న భక్తులు పావన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ తర్వాత రామాలయాన్ని దర్శించుకున్నారు . 

ముత్యాల తలంబ్రాలతో సీఎం
ప్రభుత్వం తరఫున సీతారాముల పెళ్లికి,పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి సమర్పించారు. సీఎం రాక సందర్భంగా భద్రాచలంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ చౌహాన్ భద్రతపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Monday 11 April 2011

దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది...???


దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది.. కదా.. మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం ఎందుకో....? నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి ....?
ఆయనో గోప్ప........ దేముడు.. సానా గొప్ప పేరు 'సంపాదించాడు'... విదేశాలనుంచి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు... దేశ అగ్రనేతలు.. కూడా ఆయన పాదా క్రాంతులవుతారు.. ఎందుకంటే.. దేముడు కదా మరి.. తను.. గాల్లో చేతులు తిప్పి ఉంగరాలు.. విభూది ఉండలు తీయగలడు.. అతను చేతివేలు పెడితే నీళ్లు కూడా... పెట్రోల్‌ అవుతుంది.... అతను సాక్ష్యాత్‌ దైవాంశ సంభూతుడు... సంభూతుడేంటి దైవమే... మరి అలాంటి వ్యక్తితి ఆరోగ్యం కరాబ్‌గావడమేందో నా దిమాక్‌కు తట్టలే... ఎందుకంటారా.. ఏడనన్న దేవుడికి జరమొస్తాది సెప్పుండ్రి... తన జంతర్‌ మంతర్‌ మాటలతో... ఎంతో సంపాదించాడు.. (పేరు ప్రతిష్టలు) కొంత పేదలకూ.. పెడుతున్నాడు... అది మంచి పనే అనుకోండి... కానీ దేవుడే కదా ఒక చూమంతరమేసుకుంటే పోతది కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కాస్లీ వైద్యం అందిస్తే ఆరో(గం)గ్యం కాస్త కుదుట పడిందంటా... మరి దేవుడికి జ్వరం రాదు ఇతనికి జ్వరం వచ్చింది.. అంటే... ఇతడు దేవుడు కాడనా... లేక దేవుడికి కూడా జ్వరమొస్తదనా.... లేక గజం మిథ్య పలాయనం మిథ్యనా...
నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి 
.....................................సుందర్

1. రామకృష్ణ పరమ హంస కాన్సుర్ తో బాధ పడ్డారు ఎందుకు?

2. రమణ మహర్షి ఎందుకు వ్యాది గ్రస్తుడు అయ్యారు?
3. రాముడు ఎందుకు అడవుల వెంట తిరిగాడు?
4. కృష్ణుడు బాణం తో ఎందుకు చనిపోయాడు?
5. సతీ దేవి చనిపోయిందని శివుడు ఎందుకు బాధ పడ్డాడు? శివుడు బతికిన్చాలేకా?
6. వెంకన్న బాబుకు, గద్దపలుగు తగిలి దెబ్బ తగిలిందా? నీల దేవి జుట్టు సమర్పించుకోవాల? వెంకన్న జుట్టు పెంచుకోలేడా?
7.దేవుడికి డబ్బులు ఎందుకు? చేతితోనే బంగారు నాణేలు సృష్టించుకోగలడు.
సాయి భావంతుదని నేను నమ్మను. అయన చేసే చాల పద్దతులను నేను కూడా కామెడీ చేస్తాను. కాని బాధ అనేది దివాత్వం అనేది వేరు.

Saturday 9 April 2011

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?



TUESDAY, APRIL 5, 2011

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?


తరచుగా ఒక ప్రశ్న వేస్తుంటారు - అది, బాబావారు తామే అద్భుత రీతిలో రోగాలకు చికిత్స చేసి మాన్చుతున్నప్పుడు, పుట్టపర్తిలో డాక్టర్లతోను, ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నవాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాలనేకాక విజ్ఞాన శాస్త్రాలనుకూడా దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని ఆర్జించుకోవాలి. రష్యాలో అధిమనో విజ్ఞాన శాస్త్రాన్ని (శసశూా-ఠుుగా) ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ అతిమానుషమయిన (కార్య కారణ సంబంధం లేకుండా దైవశక్తితో కూడిన) కొన్ని విషయాలమీద ఆకట్టుకొనే ప్రయోగాలను జరిపారు. వాటిని గురించి ఇటీవల అమెరికాలో ఒక తక్కువ వెల పుస్తకం ప్రచురింపబడింది. ప్రశాంతి నిలయంవంటి ఆశ్రమాలలోని డాక్టర్లు ఆధ్యాత్మిక నేపథ్యంతో వైద్య చికిత్సలు చేయాలి. డాక్టర్లు ఒక జబ్బును నిర్ధారించి దానికి చికిత్స ఎట్లా చేయాలో నిర్ణయించటానికి మందు ఆ జబ్బుమీద అంతర్‌ బుద్ధిని ప్రయోగించాలి. అప్పుడే ఆ జబ్బు వివరాలను, దానికి సంబంధించిన సూక్ష్మాంశాలను గుర్తించడంలో అతని విజ్ఞానశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. అనుగ్రహంయొక్క పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి.
డా|| సామ్యుయెల్‌ హెచ్‌. సాండ్‌వైస్‌, ఎం.డి., అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కేలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌డీగో విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసరేకాక, మనో వైజ్ఞానిక (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌గా కూడా వృత్తిని నిర్వహిస్తున్న వాడు. ఆయన రాసిన 'సాయిబాబా, ది హోలీ మ్యాన్‌ అన్‌డ్‌ ది సైకియాట్రిస్ట్‌' అన్న గ్రంథం ఎంతో ఆకట్టుకొంటున్న గ్రంథం. మనో విజ్ఞాన మూలాల్ని తెలుపుతూ ఒక ఆకర్షకమైన కథనం అందులో ఉన్నది. మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్తున్న శాస్త్రం ఒక అసమగ్రమైన శాస్త్రమనీ, దాన్ని నిజంగా ప్రభావవంతం చేయాలంటే, ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఎన్నో విషయాలను అందులో చేర్చాల్సి ఉంటుందని ఆయన నిశ్చితంగా చెప్పాడు. ఈ గ్రంథంలో డా|| సాండ్‌వైస్‌ తనకు బాబాతో కలిగిన అనుభవాలనుకూడా వివరించారు. మొట్టమొదట తను 'అనిశ్చితి', 'అనిర్ణయత' ఉన్నవాడిననీ, అధ్యాత్మక వెలుగులో తాను మారానన్నారు. తన నాస్తికపు సంశయాత్మక బుద్ధిని ఎంతమేరకు వెళ్ళగలదో అంతమేరకు వెళ్ళనిచ్చాననీ, ఐతే అట్లా సంశయించడంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నప్పటికీ, అది ఆత్మయొక్క ఉనికినీ, ఆధ్యాత్మిక సత్యాన్నీ అంగీకరిస్తుందన్నారు. తన వృత్తిమీదకూడా తనకున్న దృష్టిలో మార్పు వచ్చిందంటారు, సాండ్‌వైస్‌.
మతపరమైన మనో విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఒక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా అధ్యయనం చేయటానికి ఆయన భారత దేశానికి వచ్చారు. చిత్‌శక్తి శాస్త్ర పునాదిమీద ఆధారపడి, మనోవిజ్ఞాన చికిత్సా విధాన శాస్త్రమే తన రోగ చికిత్సా పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు.
నిపుణుల కమిటీ ఒకటి బాబావారి మిరకిల్స్‌ (అద్భుతాల)ను గురించి ప్రత్యక్షంగా అధ్యయనం చేయడంకోసం పుట్టపర్తికి వచ్చిందని నాల్గవ అధ్యాయనంలో రాశాను ('ది ఎడ్వెంట్‌ ఆఫ్‌ సత్యసాయి' -అన్న గ్రంథంలో) వారు అమెరికాలోని చెస్టర్‌ ఎఫ్‌. కార్ల్‌సన్‌ రీసెర్చి లేబొరేటరీకి చెందినవారు. ఇందులోని ఇద్దరు మనో విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు. ఊాతో పాటు ాఒ కి చెందిన అంశాలను అధ్యయనం చేయడానికే ఈ లేబొరేటరీ (ప్రయోగశాల)ని వ్యవస్థాపించారు. (ఊా మరియు ాఒ లు అతీంద్రియ జ్ఞానాన్ని శాస్త్రీయంగా పరిశోధించి తెలిపే శాస్త్రాంశాలు). ఇద్దరు శాస్త్రవేత్తలు - ఒకరు డాక్టర్‌ కార్లిస్‌ ఇసిస్‌. వీరు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చికి డైరెక్టరు. మరొకరు ఎర్‌టెన్‌డుర్‌ హరాల్డ్‌సన్‌ - ఐస్‌ల్యాండ్‌ యూనివర్శిటీకి చెందినవారు. బాబాను అధ్యయనం చేశాక వీరిద్దరూ వైదుష్యంతో కూడిన కొన్ని అంశాలతోఒక పరిశోధన పత్రాన్ని 'శ్రీ సత్యసాయిబాబావారికి సంబంధించిన ఐదు దేహాంతర కేసులు' అన్నదాన్ని రాశారు. (వీటిని క్షఇఊ అంటారు. అంటే క్షషష ుౌ ఇుdా ఊూ|స|n-| అని అర్థం. దేహం నుంచి తాను బైటకు వెళ్ళి జరిపే పనులని అర్థం). వీరి ఈ అధ్యయనాన్ని గమనిస్తే వీరికి చురుకయిన, సంకుచితం కాని మనస్సే కాక, తాము అధ్యయనం చేయదలచుకొన్న ఆధ్యాత్మికమైన మిరకిల్స్‌ మీద గౌరవం ఉన్న విషయాన్నిచూడ గల్గుతాము. అలాంటి అనుభవాలవద్దకు అవి దొంగవనో, అబద్ధమనో (ముందే ఏర్పరచుకొన్న) నిర్ణయాలతో వీరు వెళ్ళలేదు. ఈ అసాధారణ విషయాలను తమ పత్రంలో వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీటిని తెలుపడానికి తగిన పరిభాషా శబ్దాలనుకూడా వీరు సిద్ధం చేసికొన్నారు. ఇది విశేషమయిన ప్రత్యేక శాస్త్రం. సాహిత్యాన్నో, సాంఘిక, భౌతిక విజ్ఞాన శాస్త్రాలనో అధ్యయనం చేస్తే ఈ జ్ఞానాన్ని పొందలేము. ఈ పరిశోధక పత్రంలో వీరు ఆధారపడిన గ్రంథ, వ్యాస సూచికల పట్టికను పరిశీలిస్తే, వీరికి అద్యతన అధిమనో విజ్ఞాన శాస్త్రంతోనూ (పేరాసైకాలజీ), భారతీ యులూ, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ రచయితలూ బాబావారిని గురించి రాసిన రచనలతోనూ ఎంతటి గాడమైన విద్వత్తూ పరిచయమూ ఉన్నవో తెలస్తుంది. ాఒ పరిశోధనలకు ఆ శాస్త్రానికే పరిమితమైన సొంత పరిశోధన పద్ధతులున్నాయి. అధిమనో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం లేకుండా, కనీసం ఆ పద్ధతులను గురించి దిఙ్మాత్ర పరిచయమైనా లేకుండా ఎవరయినా ఇలాంటి పరిశోధనలకు పూనుకుంటే, అది సాహసమే అవుతుంది.
తమ పత్రాన్ని గురించి ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఇట్లా అన్నారు ''ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించి, తమ అనుచరులు ఈ (మా) పరిశోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించినందుకు శ్రీ సత్యసాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఇంటర్వ్యూల నిర్వహణలో తోడ్పడిన సాక్షులకూ, ఇతరులకూ హృదయపూర్వకమయిన కృతజ్ఞతలు''.
ఈ పరిశోధన పత్రం నుంచి కొన్ని ఉదాహరణలు:
''కేవలం ప్రఖ్యాతులయిన వ్యక్తులూ, శాస్త్రజ్ఞులూ, పారిశ్రామికవేత్తలూ, రాజకీయనాయకుల కోసం కాకుండా, వీరి క్షఇఊ (దేహాంతర అనుభవం) పొందాల్సిన వ్యక్తికి కల్గిన ఆత్యయిక పరిస్థితి (జబ్బూ, నిస్పృహా మొదలైనవి) వల్లనే కలిగింది. కేవలం అవసరం వల్లనే బాబావారి క్షఇఊ (దేహాంతర అనుభవం) అగుపించినందువల్ల మా పరిశోధనల్లో వారిని పాల్గొనేటట్లు చేయడానికి మాకు అత్యల్ప అవకాశమే ఉన్నదని గ్రహించాము. ఐతే, వారు మాకోసంగాను అనేక సందర్భాలలో వస్తువులు అగుపించడం, మాయమవడం వంటివాటిని చూపించారు....''
ఈ నిపుణులు ఆకర్షకమైన కేసులను అన్వేషించే కార్యక్రమంలో, మూడుసార్లు భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలను చూశారు. 1973లో వారు చేసిన మూడవ పర్యటనలో వారికి బాబా విషయం తెలిసి వారిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలనిపించినట్లుగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయిన ఒక వృద్ధురాలైన భక్తురాలికి బాబావారు ప్రత్యక్షం కావడాన్ని గురించి వీరీ పత్రంలో తెలిపారు: మద్రాసు సమీపంలో ఉన్న వెంకటగిరిలో ఉంటూనే శైలజ అన్న ఒక చిన్నపిల్ల ప్రార్థనవల్ల కాలికట్‌ సమాపంలోని మంజేరీలో శరీరంతో అగుపించి కొన్ని గంటలు భజన, సంభాషణ చేయడంగురించి ఇందులో వీళ్ళు తెలిపారు.
(వారి మాటల్లో ''మంజేరీ విషయంగా మేము బాబావారిని ప్రశ్నించాము. రెండు సందర్భాలలో 'తాను' దేహం విడిచి రావు కుటుంబంతో ఉన్నట్లుగా ధృవీకరించడం చాలా క్లుప్తంగా చేశారు.'')
ముగ్గురు దుబాసీల సహాయంతో వీళ్ళు 21 మంది సాక్షులను పరీక్షించినట్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఏయే అంశాలను పరీక్షించాలో ఆరు పట్టికల్లో రాసికొన్నారు. ఈ నిపుణులు ఇంకా వివరిస్తూ -''దేశ దిమ్మరి సన్న్యాసులవలె సాయిబాబా భిక్షమడగరు. ఏమీ కోరరు. పోగా వారే ఇతరులకు సాయం చేస్తుంటారు'' అని తెలిపారు. బావిలో పడి మునిగిపోతున్న ఒక మనిషిని సాయమం దించేవాళ్ళు వచ్చేదాకా తానే సూక్ష్మ శరీరంతో ఎత్తి ఉంచిన కుప్పం సంఘటనను గురించి చర్చిస్తూ ఈ నిపుణులు ''ఇది క్షఇఊ అంశం. ఊా (ఊషసశ ా|nుసా |స-|ూషుn -అంతీంద్రియ గ్రమణం) కన్నా విశేషమైనది'' అని అంటూ ''బాబా తమని అవతారంగా భావించే - వారి అనుయాయులకు అనేకానేక ఊా శక్తులను ఖచ్చితంగా ప్రదర్శించారు. వారి ఊా శక్తిని మేము కూడా స్వయంగా చూశాము. ఊఐ కు (అతని స్వదేశమయిన) ఐస్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రత్యేక సందర్భాలను సరిగ్గా పేర్కొన్నారు'' అని అన్నారు. ఆ విషయాన్ని గురించి వీళ్ళు ''బాబా చెప్పినవి క్షఇఊ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
తమ పరిశోధన పత్రం ముగింపుగా వీరు ''అరవై లక్షల భారతీయ భక్తులు శ్రీ సత్యసాయిబాబా ఒక విశేష లక్షణ వ్యక్తిగా, అవతారంగా భావించడం విషయంలో మనం దాని సంభావ్యతనుగురించి సానుకూల మనస్కతతో ఉండాలి. పోగా, ఈ కేసులు ఆయనను గురించి ప్రత్యేకంగా తెలియపరిచేవేగాని భారతీయ సంస్కృతినిగురించి తెలిపేవి కావు. వీరికి సంబంధించిన ఈ కేసులు పాశ్చాత్య దేశాల కేసుల కన్నాకూడా ఖచ్చితంగా విల క్షణమయినవి. అసా ధారణమైనవాటిని గురించి తెలిసికోవడానికి ఇవి ఎక్కువ వీలు కల్గిస్తున్నట్లుగా అగుపిస్తున్నది'' అని రాశారు. వీటన్నిటివల్ల శరీరంతోనూ, క్షఇఊ పద్ధతుల ద్వారానూ బాబావారు సామాన్య మానవునికి ఎట్లా సాయం చేస్తున్నారన్న విషయం పాఠకులకు తేటతెల్లమవుతుంది.
ాఒ శాస్త్రాన్ని (క్షఇఊ, ఊా మొదలైనవి) అధ్యయనం చేయాలని కోరుకొనే వ్యక్తులు ఇది అత్యంత నూతన విజ్ఞానశాస్త్రమనీ, ప్రపంచంలో ఎంతో అభివృద్ధి పొందిన దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధించడానికి ప్రయోగశాలలూ, యూనివర్శిటీలూ స్థాపించారనీ గమనించాలి.పైన పేర్కొన్న పత్రం నుంచి అక్కడక్కడ ఉటంకించిన కొన్ని కొటేషన్లుకూడా ఈ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైందనీ, దీని పద్ధతులు వేరనీ, వీటిని అనుసరించి పరిశోధనలు జరిపినప్పుడే సత్యం ఆవిష్కారమవుతందనీ తెలుపుతాయి. ఏదో ఒక అంశంలోనైనా అనుభవాలను గురించిన ఈ ప్రయోగశాలల్లోకూడా తప్పులు జరుగవచ్చు. ఈ క్షేత్రంలో పని చేయడానికి భారతదేశంలో ఎందరికి శిక్షణ ఉన్నది? ఎందరు యోగ్యతా, అర్హతా 

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్‌కు ‘గుడ్‌బై


అరకులోయ, ఏప్రిల్ 9: కడప, పులివెందులలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి ‘గుడ్‌బై’ చెప్పనున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి వెల్లడించారు. అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్న తాను ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. కడప, పులివెందుల స్థానాల్లో నుంచి ఎన్నికల బరిలో ఉన్న విజయమ్మ, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందినట్టు ప్రకటన వెలువడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటానని ఆయన తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని, అంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన చేరికపై వేచి ఉండకతప్పదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను దాదాపు 40 వరకు ఆవిష్కరించానని ఆయన చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో తన చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. తనయుడు, కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని కొంతమంది నాయకులను అప్పట్లో తాను హెచ్చరించినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీని వీడితే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలవుతుందని అప్పట్లో తాను చెప్పిన మాటలు నేడు సత్యరూపం దాల్చాయన్నారు. తానెప్పుడూ స్థానిక నాయకులను గౌరవిస్తానని, అదేవిధంగా కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తానని, అయితే ఇందుకు భిన్నంగా మన్యం వాసులు వ్యవహరిస్తుండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక నాయకులను వీడి ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చే నేతలను ఈ ప్రాంతం వారు గౌరవించడం ఆశ్చర్యకరంగా ఉందని సబ్బం హరి పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనుల అండదండలతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల పరిరక్షణ కోసం పోరాడుతానన్నారు. రాజకీయంగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విజయమ్మ, జగన్మోహన్‌రెడ్డిల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపుకు ప్రతీఒక్క గిరిజనుడూ తమవంతు కృషిచేయాలని ఆయన కోరారు. రానున్న కాలంలో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నియోజకవర్గ ప్రజలు బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం మార్చేస్తుందని కుంభా రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమారాణి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, రఘురాజు, పోతురాజు, పాంగి చిన్నారావు, విజయ్‌కుమార్, బూర్జబారికి జగ్గన్న, పి.కొండలరావు, శెట్టి ఆనందరావు, శోభా వీరభద్రరాజు, గుడివాడ ప్రకాశ్‌రావు, వెచ్చంగి పద్మ, వెచ్చంగి గంతన్న, కాసులమ్మ, కొండబాబు, పద్మలతో పాటు వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.

నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు



Monday, April 4, 2011

'ఫైర్'తో వస్తున్నా

'ఫైర్'తో వస్తున్నా



ప్యాంటీ లేకుండా మెరిసిన 'సోనాలి బింద్రే


ప్యాంటీ లేకుండా మెరిసిన 'సోనాలి బింద్రే



నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు


నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు
లేత ముద్దుగుమ్మ పూనమ్‌కౌర్‌ ఇప్పటి వరకు ఫ్యామిలీ హీెరోయిన్‌గానే కనిపించింది ఇక నుంచి ఆ పాత్రలకు గుడ్‌బై చెప్పిన.... పూనమ్‌కౌర్‌ తన సెక్సీగా ఉంటూ... తన శృంగా తత్వాని బయటపెట్టడనికి రేడి అవుతుంది. ఇక ఫ్యామిలీ హీరోయిన్‌గాక తన అందచందలను చూపిచడానికి సన్నదమవుతుంది.
ఇప్పటి నేను అలషం చేశాను అనుకున్నదేమో కాని నాలో ఇంత సెక్సీతనాన్ని ఉంచుకుని చీర కట్టుకుని సరుకు కనిపించకుండా కూర్చుంటే లాభంలేదంటూ.. తన అందాలను ఆరబోయాటానికి సిద్ధంగా ఉందిటా.. ఈ సారి నుంచి బోల్డగా నటించిన బోలెడంత ఇమేజ్‌ను సొంత చేసుకోవటానికి ఉవిళ్ళుఊరుతుందిటా.. పూనమ్‌. అసలే మన కుర్రళ్ళు ఈ గడసరి సుందరి స్టేమేంట్‌ సంగతి చెవిలోనడ్డితే ఊరుకుంటారా? ఉరుకులు పరుగులు మన హీరోయిన్‌ పూనమ్‌ ఎలాంటి మగాడు తాకుతాడో చూడాలి.లేత ముద్దుగుమ్మ పూనమ్‌కౌర్‌ ఇప్పటి వరకు ఫ్యామిలీ హీెరోయిన్‌గానే కనిపించింది ఇక నుంచి ఆ పాత్రలకు గుడ్‌బై చెప్పిన.... పూనమ్‌కౌర్‌ తన సెక్సీగా ఉంటూ... తన శృంగా తత్వాని బయటపెట్టడనికి రేడి అవుతుంది. ఇక ఫ్యామిలీ హీరోయిన్‌గాక తన అందచందలను చూపిచడానికి 

happy brithday baneeth







Sunday 3 April 2011

కొత్త బిజినెస్‌లోకి నమిత ఎంట్రీ ..???


సదరన్ స్పైస్ నమిత.. సినిమాలకు చెల్లుచీటీ ఇస్తానంటోంది. బరువుబాధ్యతలు పెరిగిపోయి.. కాల్‌షీట్లు మిగిలిపోయి.. ఎటూపాలుపోక.. రిటైర్మెంట్ వైపు చూస్తోంది. అలాగని సినిమాలు మానేసి.. సైలెంట్‌గా కూర్చుంటుందా..? అదీ లేదు.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.. ఏంటా బిజినెస్.. ఏమా కథ..? నమిత అంటే నథింగ్ బట్.. నాటుబాంబు. సినిమా లోపలా బయటా.. మగరాయుడిలా బతికింది. అన్ని దక్షిణాది భాషల్లోనూ చెలరేగి నటించింది. 
రెండో హీరోయిన్‌గా రెండుమాడు సీన్లలో కనిపించినా.. ఐటమ్ గాళ్‌గా ఆరితేరినా అందరిలోనూ కిక్కు రేపింది. పదేళ్లపాటు ఒకే ఫామ్‌ను ఎంజాయ్ చేసింది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అందరు హీరోల సరసనా కనిపించాక.. నమిత దగ్గర స్టాక్ అయిపోయినట్లుంది. బాడీకి బరువు పెరిగి.. మేనికి గ్లామర్ తగ్గి.. ఛాన్సులిచ్చేవాళ్లు మొహం చాటేస్తున్నారు. పాతవాసనలే పెట్టుబడిగా అవకాశాలకు వల విసరాల్సిన పరిస్థితి.
వయసు ఫార్టీప్లస్‌లో పడింది. వెయిటూ వందకు దగ్గరవుతోంది. నమిత సినిమా క్లయిమాక్స్‌కొచ్చినట్లేనని అందరూ కమిటయ్యారు. అందర్లాగే.. నమితది కూడా.. గ్లామర్ వున్నప్పుడే కాసులు ఏరుకోవాలన్న స్ట్రాటజీ. అందుకేనేమో.. రూటు మార్చేసి.. బిజినెస్‌ వైపు స్టెప్పులేస్తోందీ అమ్మడు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి.. ముంబైలో రియలెస్టేట్ బిజినెస్ మొదలుపెడుతోంది. కానీ.. ముంబైలాంటి మహానగరాల్లో లాండ్ కొనడం, అమ్మడం అంటే.. మాటలు కాదు. నమిత దగ్గర ఇంత దమ్ము వుందా..? ఫిల్మీ కొలీగ్స్ అంతా ఇలాగే షాకవుతున్నారు. 

నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి


ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. ఆయన 1950 అక్టోబర్ 10న కృష్ణాజిల్లా కలిదిండిలో జన్మించారు. నూతనప్రసాద్ అసలు పేరు తాడినాడ వర ప్రసాద్.
అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., చలిచీమలు సినిమాలో‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.

రాష్ట్ర జనాభా 8.46 కోట్లు


హైదరాబాద్ : జాతీయ స్థాయిలో చేపట్టిన జనాభా గణన ప్రకారం రాష్ట్ర జనాభా8,46,65,533కి చేరింది. రాష్ట్రంలో జనాభా లెక్కల వివరాలను ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ తెలిపారు.మొత్తం జనాభాలో పురుషుల సంఖ్య 4,25,09,881 కాగా, మహిళల సంఖ్య 4,21,55,652. జనాభా వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ కూడా పాల్గొన్నారు.తాజాగా జరిపిన జన గణన సందర్భంగా ‘నపుంసకుల’ను కూడా గణించారు కానీ వీరిని పురుషుల జాబితాలోనే కలిపారు. వీరి సంఖ్యను తర్వాత వెల్లడిస్తామని అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ఇవి ప్రాథమిక లెక్కలని, పూర్తిస్థాయి లెక్కలు వెల్లడించడానికి మరో ఏడాది సమయం పడుతుందని వివరించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా 7,62,10,007 మాత్రమే. రాష్ట్రంలో జన గణన 2011 ఫిబ్రవరి 9న ప్రారంభించి ఫిబ్రవరి 28న ముగించారు. 2011 మార్చి ఒకటి నుండి ఐదు వరకు రివిజనల్ రౌండ్ లెక్కింపు జరిగింది. 2011 మార్చి 1 ప్రారంభం అయ్యే సమయానికి జన్మించిన ప్రతిశిశువును రెండో పర్యాయం జరిగిన రివిజనల్ రౌండ్ సందర్భంగా లెక్కల్లోకి తీసుకున్నారు. జనాభా గణనలో తొలుత 2010 ఏప్రిల్ 26 నుండి జూన్ 10 వరకు జరిగిన గణనలో ఇళ్ల వివరాలను సేకరించారు. దీని ఆధారంగా జనాభా గణన చేశారు.ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశంలో నాలుగో స్థానంలో ఉండగా జనాభా పరంగా ఐదోస్థానంలో నిలిచింది. జనాభా అత్యధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లాగా రంగారెడ్డి (52,96,396) నిలిచింది. రెండో స్థానంలో తూర్పుగోదావరి (51,51,549), మూడో స్థానంలో గుంటూరు జిల్లా (48,89,230) నిలిచింది. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (23,42,868) నిలిచింది. మహిళల జనాభాలో కూడా రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఈ జిల్లాలో మహిళల సంఖ్య 25,87,702కాగా అతితక్కువ మహిళల జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (11,80,955) నిలిచింది. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభాలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (18,480), అతితక్కువగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ (170) నిలిచాయ.అక్షరాస్యతలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (80.96%) నిలవగా రెండో స్థానంలో రంగారెడ్డి (78.05%), మూడో స్థానంలో కృష్ణా జిల్లా (74.37%) నిలిచాయ. అతితక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (56.06%), ఆ తర్వాతి స్థానంలో విజయనగరం (59.49%) నిలిచాయ. మహిళల విషయం పరిశీలిస్తే మహిళల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాగా హైదరాబాద్ (78.42%), అతితక్కువ ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (45.65%) నమోదయ్యాయ.(చిత్రం) గురువారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో జనగణన వివరాలు వెల్లడిస్తున్న జనగణన శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ. చిత్రంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ ఉన్నారు.