కడప, మే 13:కడప ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన జగన్మోహన్రెడ్డి భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. అదే విధంగా పులివెందుల శాసనసభకు పోటీచేసి గెలిచిన దివంగత నేత వైఎస్ సతీమణి విజయలక్ష్మి సైతం భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల మెజారిటీ సాధించిన జగన్మోహన్రెడ్డి దేశంలో మూడవ స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. రామ్విలాస్ పాశ్వాన్ 7 లక్షల రికార్డు మెజార్టీతో మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్కు చెందిన అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో రెండవ స్థానంలో నిలిచారు. జగన్ తాజాగా 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో మూడవ స్థానంలో నిలిచారు. జగన్ తన తండ్రి రికార్డును సైతం బద్దలు కొట్టారు. రాజీవ్ మృతితో 1991లో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర్రెడ్డి కడప లోక్సభకు పోటీచేసి 4.18 లక్షల మెజారిటీ సాధించారు. అప్పట్లో ఇది రికార్డు. అదే విధంగా కడప లోక్సభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక రికార్డు. రాష్ట్రంలో ఈ మెజార్టీ రికార్డు కావడం మరో విశేషం. ఇక పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించిన విజయమ్మ తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి రికార్డును బద్దలుకొట్టారు. 2009లో రాజశేఖర్రెడ్డికి 68,681 ఓట్ల మెజారిటీ రాగా, తాజా ఉప ఎన్నికల్లో విజయమ్మకు 85,191 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ నియోజక వర్గంలో గతంలో ఎవరు ఇంత మెజార్టీ సాధించిన దాఖలాలు లేవు.
విజయోత్సవాలు
కడప ఉప ఎన్నికల్లో జగన్, ఆయన తల్లి విజయం సాధించడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కడప లోక్సభకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పులివెందుల శాసనసభకు వైఎస్ విజయమ్మ గెలిచినట్లు ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జగన్కు జై. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టుకుని మోటార్బైక్లపై ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మొదటి మూడు రౌండ్లు ఓట్ల లెక్కింపులోనే జగన్, విజయమ్మ లీడింగ్లో ఉన్నట్లు వార్తలు వెలువడగానే జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. రౌండ్ రౌండ్కు మెజారిటీ పెరుగుతూ రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. చివరకు జగన్మోహన్రెడ్డి, విజయమ్మ భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించగానే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దమొత్తంలో బాణసంచా పేల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జెఎంజె కౌంటింగ్ కేంద్రం బయట రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వైయస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మద్రాసు రహదారిపై నృత్యాలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
కడప గడపలో వరుసగా వైఎస్ కుటుంబానిదే విజయం
కడప, మే 13: కడప లోక్సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ కుటుంబం మరోసారి విజయం సాధించింది. 1989 నుంచి జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.వి. రమణారెడ్డిపై లక్షా 66 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో పోటీచేసిన రాజశేఖర్రెడ్డి టిడిపి అభ్యర్థి సి.రామచంద్రయ్యపై 4.18 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన వైఎస్ టిడిపి తరపున పోటీచేసిన కందుల రాజమోహన్రెడ్డిని ఢీ కొన్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్రెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా కందుల రాజమోహన్రెడ్డిపై 5,445 ఓట్ల మెజారిటీ సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నేత కందుల రాజమోహన్రెడ్డిపై 26,500 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004 ఎన్నికల్లో వివేకానందరెడ్డి మరోసారి పోటీ చేశారు. టిడిపి తరఫున పోటీచేసిన కందుల రాజమోహన్రెడ్డిపై లక్షా 40 వేల మెజార్టీ సాధించారు. 2009లో జగన్మోహన్రెడ్డి టిడిపి అభ్యర్థి పాలెం శ్రీకాంత్రెడ్డిపై లక్షా 75 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిపై 5 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించారు. (చిత్రం) ఎన్నికల అధికారినుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్
విజయోత్సవాలు
కడప ఉప ఎన్నికల్లో జగన్, ఆయన తల్లి విజయం సాధించడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కడప లోక్సభకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పులివెందుల శాసనసభకు వైఎస్ విజయమ్మ గెలిచినట్లు ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జగన్కు జై. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టుకుని మోటార్బైక్లపై ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మొదటి మూడు రౌండ్లు ఓట్ల లెక్కింపులోనే జగన్, విజయమ్మ లీడింగ్లో ఉన్నట్లు వార్తలు వెలువడగానే జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. రౌండ్ రౌండ్కు మెజారిటీ పెరుగుతూ రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. చివరకు జగన్మోహన్రెడ్డి, విజయమ్మ భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించగానే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దమొత్తంలో బాణసంచా పేల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జెఎంజె కౌంటింగ్ కేంద్రం బయట రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వైయస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మద్రాసు రహదారిపై నృత్యాలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
కడప గడపలో వరుసగా వైఎస్ కుటుంబానిదే విజయం
కడప, మే 13: కడప లోక్సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ కుటుంబం మరోసారి విజయం సాధించింది. 1989 నుంచి జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.వి. రమణారెడ్డిపై లక్షా 66 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో పోటీచేసిన రాజశేఖర్రెడ్డి టిడిపి అభ్యర్థి సి.రామచంద్రయ్యపై 4.18 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన వైఎస్ టిడిపి తరపున పోటీచేసిన కందుల రాజమోహన్రెడ్డిని ఢీ కొన్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్రెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా కందుల రాజమోహన్రెడ్డిపై 5,445 ఓట్ల మెజారిటీ సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నేత కందుల రాజమోహన్రెడ్డిపై 26,500 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004 ఎన్నికల్లో వివేకానందరెడ్డి మరోసారి పోటీ చేశారు. టిడిపి తరఫున పోటీచేసిన కందుల రాజమోహన్రెడ్డిపై లక్షా 40 వేల మెజార్టీ సాధించారు. 2009లో జగన్మోహన్రెడ్డి టిడిపి అభ్యర్థి పాలెం శ్రీకాంత్రెడ్డిపై లక్షా 75 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిపై 5 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించారు. (చిత్రం) ఎన్నికల అధికారినుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్
No comments:
Post a Comment