Monday 7 March 2011

ఎమ్మెల్సీ టిక్కెట్ ఎఫెక్ట్: ప్రరాపాకు వాసిరెడ్డి రాజీనామా!!

ప్రజారాజ్యంకు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రరాపాను విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేక, మనస్సు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో పని చేయలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె సోమవారం ప్రకటించారు. అయితే, వాసిరెడ్డి పద్మ రాజీనామాకు కారణాలు లేకపోలేదు. శాసనమండలి అభ్యర్థిత్వంపై ఆమె గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ సీటును ప్రరాపా సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆమె జీర్ణించుకోలేక పోయారు. 
దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకుని తన రాజీనామా లేఖను సోమవారం
 పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి పంపినట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీలో
 పీఆర్పీ విలీనాన్ని జీర్ణించుకోలేక పోతున్నందునే పార్టీని వీడుతున్నట్లు 
ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
**********************************

No comments:

Post a Comment